రాజన్న సిరిసిల్ల జిల్లా, ది రిపోర్టర్ టీవీ: ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో పిండప్రాదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ గత కోన్ని రోజులుగా కురిసిన భారీ వర్షలకు పంటలు నష్టపోయిన రైతులకు వారి కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇల్లంతకుంట మండలంలో కూడా పంటపొలాలు నష్టపోయిన కనీసం శాసనసభ్యుడు ఇప్పటి వరకు సందర్శించలేదన్నారు, ఇప్పటికైనా అధికారులు వెంటనే సర్వే చేసి రైతులకు నష్ట పరిహారం ఇవ్వలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి, అంతగిరి బాలపోచయ్య, మైనర్టీ అధ్యక్షలు జమాల్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ ,అన్నడి సంపత్ రెడ్డి, దూస రాజు, కోటేశ్వర్, రాజేంద్రా,కాసుపాక రమేష్, న్యాత బాబు తదితరులు పాల్గొన్నారు.
