కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. ఐదు నెలలు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది అన్నారు. మండలంలోని నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెల్లాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను అధికార పార్టీ నాయకులకు వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తెలుస్తాం అని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, మానకొండూరు నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి ,మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి,జిల్లా నాయకులు చొక్కారావు పల్లె ఉప సర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఒగ్గు దామోదర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, నాయకులు గుర్రం వాసు గౌడ్,బుర్ర అంజయ్య గౌడ్, తిప్పర్తి పరిపూర్ణ చారి ,మల్లయ్య గౌడ్, కొలుపుల రవీందర్, వంశీకృష్ణారెడ్డి ,దేశరాజు అనిల్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
