ఆర్మూర్ డివిజన్ ఆద్వర్యంలో తేదీ 29/06/2023, గురువారం, ఏకాదశి రోజున బక్రీద్ పండుగ వస్తున్నందున బక్రీద్ పేరిట గోవులను వధించడాన్ని వ్యతిరేకిస్తూ గో సేవా జిల్లా ప్రముఖ్ పాండురంగారావు ఆర్మూర్ పోలీసు కార్యాలయంలో ఈరోజు ఫిర్యాదు చేయడమైనది.
ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ… ఈనెల 29వ తేదీ న బక్రీద్ పండుగ వస్తుందని గోవులను ఆర్మూర్ పట్టణానికి, అదేవిధంగా వివిధ గ్రామాలకు అక్రమంగా తరలించకుండా పోలీసులు శాఖ వారిచే గట్టినిగా వేసి తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి హిందువుల పవిత్ర మాత అయిన గోమాతను రక్షించాలని. లేనట్లయితే గో సంరక్షణ ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను నిలువరించే సందర్భంలో జరిగే పరిణామాలకు పోలీసులు, ఆర్డీవో, మునిసిపల్ కమిషనర్ మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసిన వస్తుందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్రమంగా గోవులను తరలించే వారిపై గట్టి నిఘా నుంచి ఏర్పాటు చేసి, వారిని అడ్డుకొని వారిపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, నందిపేట ఖండ గో సేవా ప్రముఖ్ బద్గుణ వంశీ కుమార్, గో సేవ ప్రముఖ్ మేకల లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, బిజెపి సీనియర్ నాయకులు భూపేందర్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్, ఓబిసి మోర్చా ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు గటడి శివ తదితరులు పాల్గొన్నారు.