contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దళిత బంధు అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలను బర్తరప్ చేయాలి: దామోదర్ రాజనర్సింహ

  • సీఎం వ్యాఖ్యలను సుమోటో స్వీకరించి విచారణకు డిమాండ్
  •  అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
  •  పార్టీ మారే ప్రసక్తే లేదు…
  •  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆందోల్ లో పోటీ చేస్తా
  •  మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ డిమాండ్

సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం దళితుల హార్దిక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా గత ఏడ ప్రారంభించిన దళిత బంధు పథకం పై ఎమ్మెల్యేలు ఒక్కొక్క లబ్ధిదారుల నుంచి రెండు నుంచి మూడు లక్షలు తీసుకున్నట్లుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించిన దాన్ని న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ చేపట్టాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అప్పుల ఊబిల్లో కురుకపోయిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు. దళితుల సంక్షేమం పేరుతో ఎమ్మెల్యేలు పర్సంటేజీలు దండుకొని ఆర్థికంగా దళితులను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తన వద్ద నివేదిక ఉందన్న మాటకు కట్టుబడి సంబంధిత ఎమ్మెల్యేను వెంటనే బర్తరపు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమం పేరుతో ఆ జాతి వర్గాలను మోసం చేస్తున్న వారిపై రాజకీయాలకతీతంగా ఉద్యమ కార్యచరణ చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో పాటు దళిత బందులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ తో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపును ఇస్తామన్నారు. దళిత బంధు పథకంలో రూ, 2 నుండి 3 లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యేల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేయాలి డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఏమ్మెల్యే లను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ, దళిత బంధులో అవినీతి పాల్పడిన ఏమ్మెల్యే ల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర గవర్నర్ తెప్పించుకోవాలి కోరారు.
దళిత బంధులో ఎమ్మెల్యేలు అవినీతి చేసారని,ఆ చిట్టా తన వద్ద ఉందని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా హైకోర్టు తీసుకోనీ విచార జరిపించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళిత బంధులో పర్సంటేజీలు తీసుకున్న శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వారిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలి దామోదర్ డిమాండ్ చేశారు.
పార్టీ మారేధీ లేదు…తాను త్వరలో పార్టీ మారుతున్నట్లుగా ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనంపై దామోదర్ స్పందించారు. తన చివరి శ్వాస వరకు ఆందోల్ నుంచే పోటీ చేస్తానని అది కాంగ్రెస్ తరపునే అంటూ స్పష్టం చేశారు. ఇటీవల ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో తన తమ్ముడు బిజెపిలో చేరినందున తాను కూడా ఆ పార్టీలో చేరుతున్నట్లు అసత్య కథనాన్ని ప్రచారం చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మీడియాపై ఉన్న గౌరవాన్ని ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించి( ప్రచారం చేసి) జర్నలిస్టు కున్న గౌరవాన్ని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటానని… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :