కేంద్ర మంత్రి ఎదురుగానే కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
బెల్లంపల్లి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో శక్తి కేంద్రాలు ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు.
బెల్లంపల్లి బిజెపి నేత కొయ్యల హేమాజీని స్టేజీ పైకి ఆహ్వానించినందుకు, పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి లేని వ్యక్తి ప్రొటోకాల్ పాటించ కుండా కోయ్యాల హేమాజీని స్టేజీ పైకి ఎలా ఎక్కిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో కోయ్యల హేమజీ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే గా పోటీ చేసిన అనుభవం, ప్రస్తుతం బెల్లంపల్లి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని చెప్పడంతో వాగ్వావాదం రసవత్తరంగా సాగింది.
కేంద్రమంత్రి ముందే ఇరువురు వ్యక్తి గత దూషణలు చేసుకున్నారు. దీంతో జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ , బుజ్జగించే ప్రయత్నం చేసారు.
అయినా వినకుండా పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ తన అనుచర గణాన్ని తీసుకుని సమావేశాన్ని బహిష్కరించారు…