contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్త్రీ జనోద్ధరణకు … ఎనలేని కృషిచేసిన కవి డాక్టర్ ఉమర్ ఆలీషా

పిఠాపురం : స్త్రీ జనోద్ధరణకు ఎనలేని కృషి చేసి, సమాజంలో అసమానతలు రూపు మాపిన సంఘ సంస్కర్త కవి శేఖర డా. ఉమర్ ఆలీషా అని అహ్మద్ ఆలీషా అభివర్ణించారు. కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి 80వ వర్ధంతి సభ కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. ఈ సభకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరులు అహ్మద్ ఆలీషా మరియు హుస్సేన్ షా, రైటర్డ్ ఆర్టీవో చిక్కo రామచంద్ర రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి విగ్రహానికి ముఖ్య అతిథులు గులాబీ గజమాల వేసి నమస్కరించుకున్నారు. కవి శేఖర డా. ఉమర్ ఆలీషా విశిష్టతను రామకృష్ణ కీర్తన రూపంలో పాడి సభికులను అలరింప చేశారు. రామకృష్ణ అనంతరం ప్రార్థనతో సభ ప్రారంభమై, హారతితో సభ ముగిసింది. మహోన్నత సేవలను చేసిన వాలంటీర్ లకు అహ్మద్ ఆలీషా ధాన్యపు కుచ్చులు పక్షులకు ఆహారం అందచేయటం జరిగింది. హుస్సేన్ షా మాట్లాడుతూ వజ్రానికి అన్ని కోణాల్లో తేజస్సు ఉన్నట్లుగా, అన్ని కోణాలలో ఎనలేని ప్రతిభ కనపరీచిన బ్రహ్మర్షి అని అన్నారు. ఈ సందర్భంగా పేరూరి సూరిబాబు మాట్లాడుతూ కవి శేఖర డా. ఉమర్ ఆలీషాని బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహు భాషా కోవిదునిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా అభివర్ణించారు. అహ్మద్ ఆలీషా మాట్లాడుతూ 553 సంవత్సరాల ఘన చరిత్ర గల పీఠానికి 6వ పీఠాధిపతిగా, 50 గ్రంథాలు రచించి, మౌల్వి బిరుదు పొంది, ఇంటర్నేషనల్ అకాడమి ఆఫ్ అమెరికా వారిచే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బిరుదు పొందారు అని అన్నారు. కవి శిరీష మాట్లాడుతూ మహాత్మా గాంధీతో కవి శేఖర డా. ఉమర్ ఆలీషా కాకినాడ, భీమవరం, విశాఖపట్నం, విజయవాడ అనేక ప్రాంతాల్లో స్వాతంత్ర్యం సముపార్జించుట కొరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కన్వీనర్ లు మండా యల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చిర్ల వెంకట రెడ్డి పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :