- డ్రగ్స్ ను అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా: మాదక ద్రవ్యనిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, దీనికోసం అవసరమైన ప్రత్యేక పోలీసుల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని. మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఐ సదన్ కుమార్,ఎంపీపీ ఉట్కూరి వెంకట రమణారెడ్డి తో కలసి పోలీస్ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5K రన్ పోస్టర్ ను ఎమ్మెల్యే చేతులమీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టిందని, యువత డ్రగ్స్ కు బానిస కావద్దని, డ్రగ్స్ వినియోగించే వారిపై విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపాలని ఆయన సూచించారు.ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై 5కే రన్ కు పెద్ద ఎత్తున యువతీ, యువకులు తరలిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, పార్లమెంట్ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పులి కృష్ణ ,అంతగిరి వినయ్ కుమార్ ,సీనియర్ నాయకులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆకుల సత్యం తదితరులు పాల్గొన్నారు.