సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతోపాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఏ మేరకు భూకంపం సంభవించిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం వాటిల్లుతుంది. అండమాన్ దీవుల్లో ఈ నెల 10వ తేదీన భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.
2023 డిసెంబర్ 30వ తేదీన మణిపూర్ లో భూకంపం వాటిల్లింది. న్యూఢిల్లీలోని 2023 అక్టోబర్ 3న భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు 40 సెకన్ల పాటు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు.నేపాల్ కేంద్రంగా భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.2023 జూన్ 13న ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భూకంప్రనలు చోటు చేసుకున్నాయి.
రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా నమోదైంది.సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2023 ఫిబ్రవరి 19న భూకంపం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్ల చెర్వు, హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది. తెలంగాణలోని హైద్రాబాద్ లోని బోరబండ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు గతంలో స్థానికులను భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే.