contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చాడా

  • సామాజిక సేవలో లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్

కరీంనగర్ జిల్లా : చిగురుమామిడి మండలం గునుకుల పల్లె గ్రామ మెయిన్ రోడ్ చౌరస్తా వద్ద లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అధ్యక్షులు గాదే రఘునాథ్ రెడ్డితో కలిసి చలివేంద్రాన్ని ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు, ప్రతి సంవత్సరం వేసవి కాలంలో భాగంగా ఏర్పాటు చేసే చలివేంద్రాన్ని ప్రారంభించి పలువురికి చల్లని నీరు అందించారు, అనంతరం మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మెయిన్ రోడ్డు చౌరస్తాలో వద్ద బాటసారిలకు చలివేంద్రాలు ఇంతగానో ఉపయోగపడతాయని తెలిపారు, గత పది సంవత్సరాలుగా రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవల పనిచేస్తుందని గ్రామంతో పాటు మండలంలో నియోజవర్గం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు చదువు కు కావలసిన సామాగ్రి తో పాటు క్విజ్ ఆటపాట తో యువకులకు వాలీబాల్ క్రికెట్ డివిజన్ స్థాయి టోర్నమెంట్ ఇలా అనేక పలు సామాజిక సేవ కార్యక్రమంలో ముందుంటుందని కొనియాడారు, మున్ముందు అనేక సేవ కార్యక్రమాల్లో ముందుండాలని తన తల్లి లక్ష్మి పేరు మీద ఏర్పాటు చేసిన లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాదే రఘునాథరెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ప్రజా గాయకుడు పల్లె నర్సింహ, అందే చిన్నస్వామి ,బూడిద సదాశివ, కంది రాజశేఖర్ రెడ్డి, గునకుల లక్ష్మారెడ్డి, బజారు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :