కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : మండలం లోని పారువెళ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాతీయ స్థాయిలో ముఖ్య భూమిక పోసించిన బంగారు తెలంగాణ వ్యూహకర్త , కరీంనగర్ జిల్లా అభివృద్ధి ప్రదాత, బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ బద్దం తిరుపతి రెడ్డి లతో కలిసి కేకు కట్ చేసి వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఉన్నత స్థానంలోకి రావాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ డైరెక్టర్ బద్దం రామ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పీచు మహేందర్ రెడ్డి, పిట్టల రాములు, చిక్కిళ్ళ చంద్రయ్య, బండిపెల్లి యేసయ్య, యాల రామ్ రెడ్డి, నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
