మంచిర్యాల జిల్లా తాండూరు: తాండూరు మండలంలోని మాదారం త్రీ ఇంక్లైన్ మరియు పలు గ్రామపంచాయతీలలో వెలసిన అక్రమ వెంచర్లు లేవట్లపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తాండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు స్థానిక ఎంపిడిఓ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు రామగౌని మహిధర్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో అక్రమ వెంచర్లు లేఔట్లు విచ్చలవిడిగా వెలుస్తున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. మండలంలో అనుమతులు లేకుండా ఉన్న వెంచర్లపై తక్షణమే ప్రభుత్వ అధికారులు దృష్టి కేంద్రీకరించి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు గత కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వివోఏ లకి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయులు,కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు నౌనూరి సుధీర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి విష్ణు కళ్యాణ్,మండల ఉపాధ్యక్షులు పుట్ట కుమార్,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్,బీజేవైయం మండల కార్యదర్శి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు
