కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కయ్యం తిరుపతి (55) సం. అనే రైతు అప్పుల బాధతో ఇంట్లో సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉండగా ప్రస్తుతం వరి పంట సాగు చేస్తున్నాడు. గతం నుంచి పంట సాగు చేసి అప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని చెల్లించే స్తోమత లేకపోవడంతో జీవితం పై విరెక్తితో ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య భాగ్యవా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిహెచ్ నరసింహారావు తెలిపారు, మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు.
