contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ను వినియోగించుకోవాలి: అదనపు కలెక్టర్ వీరారెడ్డి

  • జిల్లాలో మొక్కజొన్నలు, జొన్నలు,పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • జిల్లాలో ( 9 ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
  • రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ను వినియోగించుకోవాలి
  • మొక్కజొన్నలు క్వింటాల్ ధర రూ.1962/-
  • జొన్నలు క్వింటాల్ ధర రూ.2970/-
  • పొద్దుతిరుగుడు క్వింటాల్ ధర రూ. 6400/-

జిల్లాలో మొక్కజొన్నలు, జొన్నలు పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుకు ( 9 ) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు.

శనివారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్, సహకార, ఎస్ డబ్ల్యూ సి,తదితర శాఖల అధికారులతో జొన్నలు, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పంటల కొనుగోలుకు జిల్లాలో ( 9 )
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

జిల్లాలో 5890 ఎకరాల్లో ఎకరాలలో మొక్కజొన్న, 2974 ఎకరాల్లో జొన్న పంట,269ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగైందని, ఆయా పంటలు సుమారు 68,559 మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చే అవకాశమున్నట్లు అంచనా ఉందన్నారు.

ఆ మేరకు ఆయా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా బొక్కస్ గావ్,సదాశివపేట, ఇప్పె పల్లి,పీచేరాగడ్,ఝరాసంఘం, కృష్ణాపూర్,
ఏ డా కుల పల్లి,
డి సి ఎం.ఎస్. ఆద్వ ర్యములో నిజాంపేట్ లో,మాక్స్(వరం) ద్వారా రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కొనుగోలుకు సంబంధిత అధికారులు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం మొక్కజొన్న లకు క్వింటాలుకు 1962/- రూపాయలు, జొన్నలకు రూ.2970/- మద్దతు ధర ప్రకటించిందన్నారు.

కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, డిజిటల్ కాంటాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారికి సూచించారు. అదేవిధంగా ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేసి రవాణా ఏర్పాట్లు చేయాలని, గోడౌన్లను గుర్తించాలని సూచించారు.

నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆయా ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

మార్క్ ఫెడ్ ద్వారా
శనిగలు కొనుగోలు చేస్తున్నారని,ఎవరేని రైతులు ఇంకా శనిగలు అమ్మని వారు ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఈ రెండు మూడు రోజుల లోపు మద్దతు ధరకు అమ్ముకోవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో మార్క్ఫెడ్ అధికారి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ బజార్, మార్కెటింగ్ శాఖ ప్రతినిధి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :