- విద్యార్థులు సీరియస్
సంగారెడ్డి :సంగారెడ్డి జిల్లా మన్పల్లి మండల పరిధిలోని బుదేరా గురుకుల డిగ్రీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినీలను సంగారెడ్డి జిల్లా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వారిలో ముగ్గురికి సీరియస్ గా ఉంటే అక్కడ ఉన్న హాస్పిటల్ వైద్యులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ కి కారణమైన ప్రిన్సిపాల్ నీ మరియు వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు, కలెక్టర్ స్పందించి హాస్టల్ సందర్శించి విద్యార్థులకు మంచి భోజనం అందించాలని కోరారు.