కరీంనగర్ – గోదావరిఖని: గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం నాడు ఆర్జీవన్ మైన్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో 22 లీగ్ మ్యాచ్లు జరగగా, ఇవాళ (22/06/2025) ఫైనల్ మ్యాచ్ ఘనంగా నిర్వహించబడింది.
ఈ ఉరువలిగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో 2 ఇంక్లైన్ టీం ఏ మరియు జీడీకే-11 ఇంక్లైన్ టీం బీ పోటీపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో జీడీకే-2 ఇంక్లైన్ టీం బీ విజయం సాధించి ఫైనల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ టోర్నీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లన్న ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించారు. విజేతలకు ట్రోఫీలతో పాటు ₹11,111 నగదు బహుమతిని అందించారు. జీడీకే-1 & 3 ఫిట్ సెక్రటరీ మనల శ్రీనివాస్ ₹5,555, ఆర్జీవన్ బ్రాంచ్ సెక్రటరీ ₹5,000 నగదు బహుమతులను అందించారు. రన్నరప్ జట్టు కోసం ట్రోఫీతో పాటు ₹5,555 నగదు బహుమతిని ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ లలిత్ కుమార్, జీడీకే-11 ఇంక్లైన్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి ఎల్లగౌడ్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, జీడీకే-1 ఫిట్ సెక్రటరీ మండల శ్రీనివాస్, జీఎం కమిటీ మెంబర్ మల్లికార్జున్, ఫుడ్ సెక్రటరీ వెంకటయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.