contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Godavarikhani : సింగరేణి RG 1 ఏరియాలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్

కరీంనగర్ – గోదావరిఖని: గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం నాడు ఆర్జీవన్ మైన్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో 22 లీగ్ మ్యాచ్‌లు జరగగా, ఇవాళ (22/06/2025) ఫైనల్ మ్యాచ్ ఘనంగా నిర్వహించబడింది.

ఈ ఉరువలిగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2 ఇంక్లైన్ టీం ఏ మరియు జీడీకే-11 ఇంక్లైన్ టీం బీ పోటీపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జీడీకే-2 ఇంక్లైన్ టీం బీ విజయం సాధించి ఫైనల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఈ టోర్నీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లన్న ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించారు. విజేతలకు ట్రోఫీలతో పాటు ₹11,111 నగదు బహుమతిని అందించారు. జీడీకే-1 & 3 ఫిట్ సెక్రటరీ మనల శ్రీనివాస్  ₹5,555, ఆర్జీవన్ బ్రాంచ్ సెక్రటరీ ₹5,000 నగదు బహుమతులను అందించారు. రన్నరప్ జట్టు కోసం ట్రోఫీతో పాటు ₹5,555 నగదు బహుమతిని ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ లలిత్ కుమార్, జీడీకే-11 ఇంక్లైన్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి ఎల్లగౌడ్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, జీడీకే-1 ఫిట్ సెక్రటరీ మండల శ్రీనివాస్, జీఎం కమిటీ మెంబర్ మల్లికార్జున్, ఫుడ్ సెక్రటరీ వెంకటయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :