గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ‘గస్టో- 2024’ పేరిట నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిసినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. విజేతలకు ప్రొఫెసర్ సి.త్రినాథరావు, ప్రొఫెసర్ ఎం. ఆక్కలక్ష్మి, డాక్టర్ ని. ఫణికుమారి, డాక్టర్ ఉమా సుస్మిత పెరెపో, డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి తదితరులు బంగారు పతకాలు, బ్రోఫీలను ఇచ్చి సత్కరించారు. వివిధ క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో క్రీడా స్పూర్తి పెంపొందుతుందని వారు ఉద్ఘాటించారు. ముఖ్యమైన జీవిత పాఠమైన గెలుపు-ఓటమి.. రెండింటినీ సునాయాసంగా అంగీకరించడం నేర్చుకుంటారని వారు అభిప్రాయపడ్డారు.
వివిధ క్రీడా పోటీల విజేతలు, ద్వితీయ విజేతల వివరాలు:
బ్యాడ్మింటన్ విజేత భవన్స్, రన్నరప్ మహీంద్రా విశ్వవిద్యాలయం:
బాస్కెట్బాల్ (పురుషుల) విజేత సీఎన్ఆర్ నీజేఐఈటీ, రన్నరప్ గీతం: బాస్కెట్బాల్ (మహిళలు) విజేత విల్లా మేరీ, రన్నరస్ మహీంద్రా విశ్వవిద్యాలయం; క్రికెట్ విజేత ఎంవీఎస్ఆర్, రన్నరప్ గురునానక్ ఇన్స్టిట్యూట్; ఫుట్బాల్ (పురుషులు) విజేత ముహీంద్రా విశ్వవిద్యాలయం, రన్నరప్ గీతం; ఫుట్బాల్ (మహిళలు) విజేత గీతం, రన్నరప్ సుహీంద్రా విశ్వవిద్యాలయం; కబడ్డీ (పురుషులు) విజేత గీతం, రన్నరప్ ఏఎస్ఆర్ ఏజేఐఈటీ; కబడ్డీ (మహిళలు) విజేత గీతం, రన్నరప్ సిఎన్ఆర్ విజేఐఈటీ; టేబుల్ టెన్నిస్ (పురుషులు-సింగిల్స్) విజేత మెథడిస్ట్ కళాశాల విద్యార్థి త్రిశూల్, రన్నరప్ గీతం విద్యార్థి
టేబుల్ టెన్నిస్ (పురుషులు- డబుల్స్) విజేతలు విట్-ఏపీకి చెందిన సందీప్-అభిషేక్, రన్నరప్ మహీంద్రా.
విశ్వవిద్యాలయానికి చెందిన సీవర్ -రోహిత్:
టేబుల్ టెన్నిస్ (మహిళలు సింగిల్స్) విజేత కేఎస్ఆర్యూ హెచ్ఎస్కు చెందిన ఇక్షిత, రన్నరప్ మహీంద్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆయుషి;
త్రోబాల్ విజేత ఏఎన్ఆర్ వీజేఐఈటీ, రన్నరప్ సుహీంద్రా విశ్వవిద్యాలయం; వాలీబాల్ విజేత నిజాం కళాశాల, రన్నరప్ నిట్-ఏపీ,
తొలుత, న్యూఢిల్లీలో జనవరి 26న నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఎన్సీసీ తరఫున సాంస్కృత ప్రదర్శన చేసిన బీసీ విద్యార్థిని భావరాజు నందినిని అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ మేనేజర్ తపస్వి సమన్వయం చేయగా, క్రికెట్ టీమ్ కెప్టెన్ యశ్వంత్ రెడ్డి వందన సమర్పణతో ముగిసింది.