contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి

హైదరాబాద్ : తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అధికారులను బదలీ చేసింది… మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్‌ను నియమించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీనిను నియమించింది.

ట్రాన్స్‌కో, జెన్‌కోగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం… మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జ్ ఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసింది.

మంత్రి శ్రీధర్ బాబు భార్య, ఐఏఏఎస్ శైలజా రామయ్యర్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ట్రాన్సుకో ఎండీగా సందీప్ కుమార్ ఝా, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కమ్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ బీ గోపికి బాధ్యతలు అప్పగించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :