contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Godavarikhani: గంజాయి డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన : ఇంద్రసేనారెడ్డి

గోదావరిఖని : మత్తు పదార్థాలు రహిత ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ వింగ్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మత్తు పదార్థాలు వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపెల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ నగర్ లో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ సిఐ మాట్లాడుతూ కొంతమంది వారి స్వలాభం కోసం యువత లక్ష్యంగా చేసుకొని గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుంది. నేటి యువత చెడు అలవాట్లకు బానిసలై చివరకు నేరాలకు పాల్పడుతున్నారని మంచి నడవడిక పైన జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, వారితో పాటు గంజాయి అమ్మే వారిపై మరియు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. యువత , ప్రజలు మీ చుట్టుపక్కల గాని మీ కాలనీలో గాని ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాలు విక్రయాలు రవాణా వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :