కరీంనగర్ జిల్లా: సైదాపూర్- గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు ఆంగ్లం సబ్జెక్టు పై పట్టు సాధించాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ అన్నారు. మండలం లోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఆంగ్లంలో పది జీపీఏ సాధించిన ఇద్దరు విద్యార్థులు కుతాటి పూజ శ్రీ కడారి తనయ్ లకు ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అనురాధ చేతుల మీదుగా ఆంగ్ల డిక్షనరీలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం హన్మoడ్ల భాస్కర్ మాట్లాడుతూ తాను బోధించిన ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇద్దరు విద్యార్థులకు పది జీపీఏ రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన నిర్వహిస్తున్నారని నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతోపాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారని అన్నారు క్రమశిక్షణతో ఇష్టపడి విద్యనభ్యసిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు. ప్రతి సంవత్సరం పది వ తరగతిలో ఆంగ్లంలో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఇంగ్లీష్ డిక్షనరీలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులు ఆంగ్లంతో పాటు అన్ని సబ్జెక్టులలో పది జీపీఏ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అనురాధ, ఉపాధ్యాయులు బైరి సుధాకర్, గోదారి సమ్మయ్య, గూడూరి రవీందర్ రెడ్డి,కోట సమ్మయ్య, శాంత కుమార్, సింగ్ రాజు రాజకుమార్, విజయ్ కుమార్, స్వర్ణలత, అంబు రామలక్ష్మి,విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
