హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిరక్షించాలంటూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హెచ్సీయూ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
