contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఫిర్యాదు అందిన గంటలోనే వ్యక్తి ప్రాణం కాపాడిన హైదరాబద్ పోలీస్

హైదరాబాద్ పోలీసులు ఓ కేసును గంటలోనే ఛేదించారు. దీంతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడగలిగారు. టెక్నాలజీ సహాయంతో వారు ఈ కేసును అత్యంత వేగంగా పరిష్కరించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్ప నగర్‌కు చెందిన మాలంపాక బాబీ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

సోమవారం మధ్యాహ్నం తాను డ్యూటీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. కానీ ఆ తర్వాత తన బావమరిదికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి… ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందిన వెంటనే జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ స్పందించారు. అతని మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు. సికింద్రాబాద్ మహంకాళీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. సిబ్బందిని అక్కడకు పంపించారు. ఓ లాడ్జిలో బాబీని గుర్తించారు. అప్పటికే అతను దోమలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :