గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ మీద రైడ్ చేశారు పోలీసులు. ఇందులో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో స్నేహితులతో కలిసి బీజేపీ (BJP) నేత యోగానంద్ కుమారుడు వివేకానంద్ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నాడు. దీని గురించి పక్కా సమాచారంతో.. రాడిసన్ హోటల్ పై పోలీసుల దాడి చేశారు. వివేకానంద్తో పాటూ మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్టీలో మత్తు పదార్ధాలతో పాటూ కొకైన్ను సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వీటిని కూడా బారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ గచ్చిబౌలీ స్టేషన్లో ఉన్నారు. అసలు పార్టీలో మొత్తం ఎంత మంది పాల్గొన్నారు.. డ్రగ్స్ను ఎవరు సప్లై చేశారు లాంటి విషయాల మీద పోలీసులు ఆరా తీసున్నారు.