అనకాపల్లి జిల్లా, వి. మాడుగుల, ది రిపోర్టర్ : వి.మాడుగుల మండలం ఉరలోవ కొండచుట్టు గతంలో పట్టాలు ఇచ్చిన వారిఅందరికీ అన్లైన్ చేయాలని సిపిఎం పార్టీ అద్వర్యం లో ధళితులు గిరిజనులు పేదలు పెద్ద ఎత్తున ఆందోళన చేపాట్టారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు కె గోవిందరావు, మండల నాయకులు ఇ.నరసింహమూర్తి, కె.భవాని మాట్లాడారు పది సంవత్సరాలు క్రితం రావికమతం మండలం కోమిరి, వి,మాడుగుల మండలం వమ్మలి ,జగన్నాదపురం గ్రామాల్లో ఐదువందలు మందికి తప్పులు సర్వే నెంబర్లు ఇచ్చి పాస్ బుక్కులు ఇవ్వడం జరిందన్నారు, ఈ పది సంవత్సరాల నుండి పేదలు తహశీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్న ఎంతో మంది తహశీల్దార్లు మారిన పేదలు భూములకు ఇచ్చిన సర్వే నెంబర్లు సరి చేసి అన్లైన్ చేయడం లెదని తప్పనిసరి పరిస్థితిల్లో వందలాది మంది పేదలు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేయడం జరుగుతుందని తెలిపారు తహశీల్దార్ కు ఈవిషయమై నాయకులు పోన్లో మాట్లాడాడంతో తహశీల్దార్ నాలుగు గంటలు వరకు రావడం కుదరని చేప్పడం ఇంతలో వర్షం రావడంతో తహశీల్దార్ కార్యాలయంలో కూర్చోని నిర్సన సాగి స్తున్నారు తహశీల్దార్ వచ్చి వెంటనే స్పస్టమైన సమాదానం చేప్పాలని అంతవరకు కదిలేది లెదని తహశీల్దార్ కార్యాలయంలో కూర్చున్నారు అదికసంఖ్యలో పేదలు మహిళలు పాల్గొన్నారు.
