కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని జంగపల్లి గ్రామంలో చొక్కారావు పల్లి ఉప సర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా శుక్రవారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు, క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో అలుగునూర్ గెలుపు పొందగా, ద్వితీయ స్థానంలో జంగపల్లి గ్రామం గెలుపొందింది, అలుగునూర్ క్రికెట్ టీం కి మొదటి బహుమతి రూ,15000/- అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అందజేశారు, రెండవ బహుమతి జంగపల్లి క్రికెట్ టీం కి అట్టికం రామచంద్రం గౌడ్ రూ,8000/- అందజేశారు, ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తాడూరి వంశీకృష్ణారెడ్డి, రంజిత్ రెడ్డి, రాకేష్, మధు, కిరణ్ రెడ్డి, అంజి, పటేల్, కర్ర సాయి,శ్రీధర్, సూరి,రాము, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు
