కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్నగర్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట కాగజ్నగర్ మండలం చింతగూడ, కోయవాగు గ్రామాల మహిళలు ధర్నా చేపట్టారు. గ్రామంలో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నార ని తమ పిల్లలు, భర్తలు గుడుంబా మహారాష్ట్రకు చెందిన దేశిదరు మద్యంకు బానిసలు అవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒక్క బెల్ట్ షాపు ఉండకుండా చూడాలని ఎక్సైజ్ సీఐ రవి కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ మీ గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయించే వివరాలు ఇస్తే తప్పకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
