కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలో డిఎస్పి రామానుజం ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 10 ఆటోలను, దేశిదారు , ఓసి మద్యం, బాటాలను స్వాధీనం చేసుకొన్నారు. డి.ఎస్పి మాట్లాడుతూ ఏరియాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వార్డు ప్రజలకు సూచించారు యువత మత్తు పదార్థాలకు బానిస కా వద్దన్నారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, రూలర్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సుధాకర్, సురేష్, సందీప్ సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
