- సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కాకినాడ : ఢిల్లీ ఒన్ జనపథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కాకినాడ లోక్ సభ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాకినాడ జిల్లా చేనేత పరిశ్రమ అభివృద్ధి, షాపింగ్ ఆర్కేడ్ నిర్మాణాలు మరియు అధునాతన ఫిషింగ్ మార్కెట్ విధానం మొదలగు వివిధ రంగాల అభివృద్ధి ప్రణాళికలు గురించి చర్చించడం జరిగిందని, దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు.