- బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న మల్లిఖార్జున స్వామి అలయం..
- మల్లన్న నామస్మరణ, శివసత్తుల పూనకంతో మార్మోగనున్న ప్రముఖ శైవ క్షేత్రం..
కరీంనగర్ జిల్లా: ప్రముఖ శైవ క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే గన్నేరువరం మండలంలోని మైలారం మల్లన్న స్వామీ బ్రహ్మోత్సవాలు జాతర ఈనెల 25 నుండి 26 తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వరాల పర్షరాములు తెలిపారు. 25-01-2025 శనివారం రోజున సాయంత్రం 5గంటల నుండి ఒగ్గుడోలు నృత్యాలతో స్వామి వారి పళ్లకి సేవ ఉంటుంది. 26-01-2025 ఆదివారం రోజున మల్లన్న పెద్ద పట్నాలు, కళ్యాణం జాతర జరుగుతుంది. శ్రీమల్లికార్జున స్వామి జాతర కు కరీంనగర్ జిల్లా నుండే కాకుండా అదిలాబాద్, వరంగల్ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల నుండీ భక్తులు వచ్చి దర్శించుకోనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.