కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు చెట్లనిడే దిక్కు అవుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు చేస్తున్న కూలీలకు వసతులు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గన్నేరువరం మండల అధికారులు స్పందించి కూలీలు పనిచేసే వద్ద వసతులు ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.. అలాగే ఉదయం 6:30 కు తిరిగి 10:30 కు ఆన్లైన్లో ఫోటోలు తీసుకుంటారు. ఆన్లైన్ సర్వర్ రాక ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పని టైం ముగించుకున్న అనంతరం కూలీలను కూడా ఎర్రటి ఎండలో నిలుచోబెట్టి గంటలు సేపు సమయం వృధా చేస్తున్నారు. దీంతో కూలీలు ఇంటికి వెళ్లే సమయం ఎక్కువ కావడంతో కూలీలు బేజారవుతున్నారు. కూలీలను ఇబ్బంది కాకుండా సమయం వృధా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు మండిపడుతున్నారు.
