- గన్నేరువరం మండలంలో ఆందోళన చెందుతున్న అసలైన అర్హులు..
- గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి..
- లబ్ధి పొందనున్న యువతీ యువకులు పేర్లు లిస్టు తయారు..
- అర్హులను గుర్తించండి..
- ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళిన ఫైనల్ లిస్టులో అనర్హులు తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి..
కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ కార్పొరేషన్ లోన్లు చేపట్టగా దాన్ని కొందరు నాయకులు తుంగలో తొక్కుతున్నారు.. గన్నేరువరం మండలంలో అనుకూలంగా ఉన్నవారికి బీసీ లోన్లు అందిస్తాం అంటూ కాంగ్రెస్ నాయకులు గందరగోళానికి తెర లేపారు.. గన్నేరువరం మండలంలో అసలైన అర్హులను గుర్తించి బీసీ కార్పొరేషన్ లోన్లు అందజేయాలని మండల ప్రజలు కోరుతున్నారు, గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారికి తిరిగి మళ్లీ పార్టీ మారిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ లబ్ధి చేకూర్చేలా కాంగ్రెస్ మండల నాయకులు చొరవ చూపెడుతున్నారు.. మూడు రోజుల క్రితం గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ఇంత అంతా కాదు.. గన్నేరువరంలో నచ్చినవారికి బీసీ కార్పొరేషన్ లోన్లు పేర్లతో లిస్టును తయారు చేసి వాటిని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు పంపిస్తున్నట్లు సమాచారం, అసలైన అర్హులను గుర్తించి బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చేటట్టు ఎమ్మెల్యే చొరవ తీసుకొని పేదలకి వర్తింపజేయాలని మండల ప్రజలు,ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.