సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామంలో ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. బెజ్జంకి మండలం నుంచి గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ వరకు 2023లో రోడ్డు నిర్మాణం జరిగిందని, గూడెం నుంచి బేగంపేట వరకు మధ్యలో రోడ్డు నిర్మించలేదని పేర్కొన్నారు. రోడ్డుపై కంకర వేసి తారు పోయకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని 15 రోజుల్లో రోడ్డు నిర్మించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి, ఏల శేఖర్ బాబు, మోహన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసు, సంపత్, రవి, వెంకట్, మల్లయ్య, కనకయ్య, మధు, కనకయ్య, చంద్రం, లింగయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
