కరీంనగర్ జిల్లా: కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, మరియు, విద్య, ఇందిరమ్మ గృహాల మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆదివారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు మరియు ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తో కలిసి మానకొండూరు నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన శాసనసభ్యులు మరియు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
