- గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లి గ్రామ శివారులోని నావల్ గ్రానైట్ క్వారీ దగ్గరికి అదే గ్రామానికి చెందిన 1) అమ్మిగల్లా ప్రశాంత్, 2) చామంతుల సురేష్ 3) దుర్ముట్ల అజయ్ లు ముగ్గురు వ్యక్తులు శనివారం రాత్రి వెళ్లి ఇక్కడ క్వారీ నడవాలంటే మాకు ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని క్వారీ సూపర్వైజర్ ను బెదిరించి అతని దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేసి తీసుకొని వెళ్లారు. క్వారీ సూపర్వైజర్ దేశ్ముఖ్ ఫిర్యాదు మేరకు ఎస్సై నరేందర్ రెడ్డి కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ఆదివారం కోర్టులో హాజరు పరిచారు.