- మొక్కలు నాటిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్
కరీంనగర్ జిల్లా: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని (ప్రపంచ మాదకద్రవ్యాల దినోత్సవం) పురస్కరించుకుని, కరీంనగర్లో వారం రోజుల పాటు (జూన్ 20 నుండి జూన్ 26 వరకు) అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు సీటీసీ (కమీషనరేట్ ట్రైనింగ్ సెంటర్) లో కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ మొక్కను నాటారు. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, హైదరాబాద్లోని టిజి ఏ ఎన్ బి డైరెక్టర్ రాష్ట్రవ్యాప్తంగా పలు సూచనలు చేశారు. ఈ సంవత్సరం ప్రపంచ మాదకద్రవ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని,టిజి ఏ ఎన్ బి విద్యా శాఖ, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు అండ్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత విభాగం (DEPWD SC & TGP) మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సహకారంతో “నాషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA)” కింద రాష్ట్రవ్యాప్త కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, ముఖ్యంగా యువత మరియు విద్యార్థులలో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు పోరాడటానికి ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు మరియు ప్రజా భాగస్వామ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 20, 2025 నుండి జూన్ 26, 2025 వరకు అవగాహన వారం నిర్వహిస్తున్నందున, కరీంనగర్ కమిషనరేట్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన ప్రచారం మరియు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ రోజు (సోమవారం) మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా స్థానిక సీటీసీలో కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సీటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఏసీపీ వేణుగోపాల్, సీసీఆర్బి ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, సరిలాల్, శ్రీనివాస్, తిరుపతి, శ్రీనివాస్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.