కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లి గ్రామంలో బుధవారం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చోక్కల్ల శ్రీశైలం విలేకరుల సమావేశం మాట్లాడుతూ గన్నేరువరం మండలంలోని రైతులకు పూర్తి స్థాయిలో రుణా మాఫీ కాలేదని, రుణ మాఫి కాని వారికి ఇంకా ఏ హామి ఇవ్వలేదు వారికీ మేము భరోసా ఇస్తాము అని కూడా అనడం లేదు వారికీ కచ్చితమైన భరోసా ఇవ్వాలని ఇది లేకుండా ,కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడం సరి కాదని ,అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలో కూడ విఫలం అయ్యారు. మండల కేంద్రానికి సరియైన రోడ్డు కూడ లేదని , మండలం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని మరియు ఆరోగ్యం కేంద్రం పనులు వెంటనే ప్రారంభం చేయాలనీ మండలంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూములు పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ గన్నేరువరం మండల తహసీల్దార్ అఫీస్ ఈనెల 30/06/2025 సోమవారం నాడు ముట్టడి చేస్తామని పార్టీ కార్యదర్శి చోక్కల్ల శ్రీశైలం పిలుపునిచ్చారు.ఇట్టి ముట్టడి కి జిల్లా కార్యదర్శి హాజరు అవుతారు అని సోమవారం నివ్వహించే తహాసీల్దార్ అఫీస్ ముట్టడి కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ,రైతులు ,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శిలు కూన మల్లయ్య,పిప్పల్ల కనకయ్య , మండల యువజున నాయకుడు మొలుగూరి అంజనేయులు,మండల నాయకులు గుండ్లపల్లి గ్రామ శాఖ కార్యదర్శి బోయిని తిరుపతి, గన్నేరువరం గ్రామ శాఖ సహాయ కార్యదర్శి బొమ్మకంటి ఆంజనేయులు, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.
