- మైలారం గ్రామంలో విషాదం
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు గువ్వ రవి వయస్సు (43)సం, ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో తెప్ప పై ఉన్న రవి నీటిలో గల్లంతయ్యాడు. సమీపంలో ఉన్న మత్స్య కార్మికులు ఈ ఘటనను గమనించి తక్షణమే తెప్పలపై సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రవికి భార్య ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న గన్నేరువరం పోలీసులు గల్లంతయిన అతన్ని ఆచూకీ కోసం స్థానిక జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.