కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు..20 ఏళ్ళ క్రితం విడిపోయిన విద్యార్థిని, విద్యార్థులు ఒకే చోట కలిసి తమ జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా 20సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా గడిపారు. ఉపాధ్యాయులకు పుష్ప గుచ్చాలు అందచేస్తూ వేదికపైకి సగౌవరంగా తీసుకెళ్లారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులను పూలదండలతో శాలువలతో సన్మానించి, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు విద్యబుద్దులు నేర్పిన ఇద్దరు గురువులు, విద్యను అభ్యసించిన ముగ్గురు మిత్రులు అకాల మరణం చెందడంతో వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి, నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్, దేవందర్ రెడ్డి, బాపురెడ్డి, రాయమల్లు, భరత్ రెడ్డి, పద్మజా, సునీత పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
