contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వారంలోగా దళితుల భూసమస్య పరిష్కరించాలి : కవ్వంపల్లి

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల పరిధిలోని జూగుండ్ల – గోపాలపూర్ గ్రామాల్లో నెలకొన్న భూసమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆ గ్రామాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మహేశ్వర్, జిల్లా సర్వే, భూరికార్డులశాఖ సహాయ సంచాలకునితో కలిసి సందర్శించి సమస్యత్మాకమైన 8 ఎకరాల స్థలాన్ని వారు పరిశీలించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గోపాలపూర్ గ్రామంలో ఒక రైతుకు, దళితులకు మధ్య భూవివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నదని, 178 సర్వే నెంబర్ లో దళితులకు చెందిన 8 ఎకరాల భూమి రికార్డుల్లో తప్ప మోఖాపై లేదని, ఆ భూములు ఆక్రమణలకు గురైనదని దళితులు ఆందోళన చెందుతున్నారన్నారు. దళితుల భూమి విషయంలో ఇరు గ్రామాల్లో రగులుతున్న భూ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే జిల్లా అధికార యంత్రాంగాన్ని ఇక్కడకు తీసుకు వచ్చినట్టు ఎమ్మెల్యే వివరించారు. ఆ 8 ఎకరాల కొలతలు,హద్దులు తేల్చాలని, ఇందుకోసం సత్వరమే భూ సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. చాలా కాలంగా నలుగుతున్న భూసమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, గన్నేరువరం తహసీల్దార్ జె.నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :