కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, ఏప్రిల్ 5: భారత మాజీ ఉప ప్రధాని, సమతావాది నేత Babu Jagjivan Ram 119వ జయంతి వేడుకలు గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మాదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సమానత్వ భావన, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు మాడుగుల కరుణాకర్ రెడ్డి, గొడుగు స్వామి, ఆసరి పర్శరాములు, నూనె అంజిరెడ్డి, బాబు, తిరుపతి రెడ్డి, మధు, సురేష్, మల్లయ్య తదితరులు పాల్గొని నేతకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.









