కరీంనగర్ జిల్లా: రాష్ట్రంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడిన వరదాల్లో ఎంతో మంది కొట్టుకపోయి చనిపోయిన ఫార్మ్ హౌస్ లో పడుకొని పట్టించుకోని కెసిఆర్ ప్రభుత్వానికి నిరసనగా కెసిఆర్,కెటిఆర్ లకు పిండ ప్రధానం చేసిన కాంగ్రెస్ నాయకులు మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలో కొట్టుకపోయిన లో లెవల్ బ్రిడ్జి వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి పిండ ప్రదానం చేసిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ.ఈ సందర్బంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల అనేక గ్రామాల్లో రోడ్లు, లో లెవల్ బ్రిడ్జ్లు కొట్టుకపోయిన చెరువులు తెగిపోయిన పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి రైతులు నష్టపోయిన ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ కనీసం క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదని గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పట్టించుకోలేదు వర్షాల వల్ల నియోజకవర్గంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిల్చిపోయాయని సరైన రోడ్డు మార్గాలు బ్రిడ్జిలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పొలంపల్లి మొగిలిపాలెం గ్రామాల బ్రిడ్జి మంజూరు ఐన టెండర్లు కాక పనులు చేయడం లేదని అధికారులు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే కమిషన్ల కి బయపడి పనులు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని కమిషన్ల ఎమ్మెల్యే, స్థానికేతర ఎమ్మెల్యే, ప్రజా సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యేకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ది చేబుతారని హెచ్చరించారు,
