జగిత్యాల జిల్లా : కోరుట్ల పట్టణంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాలాజీ గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో గణపతి విగ్రహాన్ని ఒక చోట నుండి మరో చోటుకు తరలిస్తుండగా 33/11 KV విద్యుత్ వైర్ తగిలి 10 మందికి కార్మికులు కరెంట్ షాక్ గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మిగిలిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 4 గురు వ్యక్తుల పరిస్థితి విషమం ఉండటంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ సత్య ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు జువ్వాడి నర్సింగరావు జగిత్యాల ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ వినాయకుడి విగ్రహాలు తయారు చేయడంలో బాగంగా ఒక షెడ్డు నుండి మరో షెడ్డుకు మార్చే క్రమంలో 10 మంది కార్మికులు విద్యుత్ షాక్ కు గురయ్యారని తెలిపారు. చనిపోయిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబాలకు ఇస్తామన్నారు. 4 గురు వక్తులకు గాయాలయ్యాయని వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. తక్కువ గాయలయిన వారికి పరిక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతం వినాయక విగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. నిర్వాహకులు విగ్రహాలు తయారు చేసే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగేది కాదని, ఇందులో నిర్వాహకుల నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. ఉపాధి కోసం కూలి పనులు చేసుకునే వారికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే క్రమంలో మున్సిపల్ అనుమతి ఉందా లేదా అధికారులు చూడాలన్నారు. మృతులకు ప్రభుత్వ పరంగా 5 లక్షల ఎక్సగ్రెసియా అందిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.