- జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,డీఈఓ రాము కు కృతఙ్ఞతలు తెలియజేసిన టీఎస్ జేయూ నాయకులు
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీఎస్ జేయూ కోరుట్ల నియోజకవర్గ నాయకులు జిల్లా కలెక్టర్ నీ కోరగా తక్షణమే జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీని కల్పించాలంటూ జగిత్యాల జిల్లా డిఈఓ కి తెలియపరచగా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ రాము జర్నలిస్టుల పిల్లలకి 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రొసీడింగ్ కాపీని టీఎస్ జెయు నాయకులకు అందజేశారు.ఈ సందర్భంగా టీఎస్ జేయు అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తరి రాజశేఖర్ మాట్లాడుతూ… జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి టీఎస్ జేయూ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రొసీడింగ్ కాపీని ఇవ్వడం పట్ల జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,డీఈఓ రాము, సూపరిండెంట్ విజయ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ దివాకర్, మీడియా ఇంచార్జ్ రవి రాజ్, ఈసీ మెంబర్లు గట్ల శ్రీనివాస్, సయ్యద్ ఫిరోజ్, శ్రీనివాస్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.