- కళాకారులకు కేటాయించిన భూములను దౌర్జన్యంగా లాక్కోవద్దని నిరసన కార్యక్రమం
- ఆక్రమించిన భూములను నిరుపేద కళాకారులకు పంపిణీ చేయాలని కోరిన జాతీయ బహు కళాకారుల రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టిపాలెం వెంకటేష్ జాంబవ రాజు
పల్నాడు జిల్లా గురజాల ఆర్డీవో కార్యాలయం నందు నిరసన కార్యక్రమం చేపట్టినా జాతీయ బహు కళాకారుల రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బహు కళాకారులకు మాచర్ల పట్టణంలోని కెసిపి ఫ్యాక్టరీ యజమాని వారు ఆక్రమించిన భూములను బహు కళాకారులకు పంపిణీ చేయాలని మరియు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని వారు అసైన్డ్ భూములను ఆక్రమించి బినామీ పేర్లతో లీజు తీసుకువచ్చిన వాటిని రద్దు చేసి నిరుపేదలకు పంపిణీ చేయాలని జాతీయ బహు కళాకారుల రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టిపాలెం వెంకటేష్ జాంబవ రాజు సారధ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు జానపద కళాకారుని రామావత్ మాంగో బాయి వడితే తిరుపతి నాయక్ రామాతు కోమిటి పికిలి బాయి మంత్రి బాయి రామావత్ సెవెలి వడితే సివిల్ వంకరావతి కమల రామావత్ షావలి రైతు కూలి మహిళా లీడర్లు రాయపాటి జయమ్మ పెనిమెళ్ళ వరలక్ష్మి డప్పు కళాకారులు దాసరి స్వామి దాస్ ఆలేటి రత్నం ఖమ్మం పార్టీ దానం ఖమ్మం పాటి సంసోను ఏల్పుల బిక్షం గెల్లెపోగు ప్రభుదాస్ కోళ్ల పేతురు సాంఘిక నాటకం స్టేజి కళాకారుడు మల్లెల శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొని సుమారు 100 మందితో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జెట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని వారు ఆక్రమించిన భూములను మరియు మాచర్ల పట్టణంలో కెసిపి ఫ్యాక్టరీ యాజమైన వారు ఆక్రమించిన భూములను నిరుపేదలకు కళాకారులకు పంపిణీ చేయాలని స్పందన కార్యక్రమంలో ఆర్డీవో కి వినతి పత్రం అందించారు గురజాల ఆర్డీవో త్వరలోనే ఎంక్వయిరీ చేపడతామని హామీ ఇచ్చారు పేద కళాకారులకు న్యాయం చేసే వరకు పోరాడతామని తెలిపారు