contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Nellore : భూ ఆక్రమణలకు అడ్డుకట్ట పడేనా..???

వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత. ప్రస్తుతం మండలంలో ఇదే తీరున అక్రమార్కుల భూ దందా సాగుతున్నదని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల వాసులు బాహాటంగా ప్రస్థావిస్తున్నారు. మండలంలో ప్రభుత్వ భూ ఆక్రమణల పర్వం జోరుగా సాగుతున్నదని అందరికి తెలిసినా అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్పందించడం లేదని మండల వాసుల ఆరోపిస్తున్నారు. ఒకవేళ చేసినా అదీ మొక్కుబడిగా చర్యలు చేపట్టడం ఆ తర్వాత మిన్నకుండిపోతుండడం షరా మామూలైంది. మర్రిపాడు మండల పరిధిలోని చుంచులూరు పంచాయతీ గ్రామాలను అనుకుని మూడు జాతీయ రహదారుల నిర్మాణం జరగతుండడంతో మారుమూల ప్రాంతంలోనూ పొలాల రేట్లు ఆకాశన్నంటడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు అసైన్డ్‌, పొరంబోకు భూముల్లో కబ్జా కాండను సాగిస్తున్నారు. అధికారుల ఉదాసీనత కారణంగా ఇప్పటికే విలువైన కొన్ని భూములు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుంటున్నాయని ఇక్కడ గ్రామస్తుల ఆవేదనచెందుతున్నారు.
ఇటీవల చుంచులూరు గ్రామంలో ఏర్పేడు జాతీయరహదారికి సమీపంలో సచివాలయానికి అనుకోని సర్వే నంబర్ 140లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వం పొలం అని “బోర్డు”లు పాతిన ఫలితం శూన్యం అని తెలుస్తుంది. అక్కడ ఓ బడాబాబు రాజకీయ పలుకుబడిని, అంగబలాన్ని ఆర్థిక బలాన్ని ఉపయోగించి ప్రభుత్వం పాతిన బోర్డును పక్కన పెట్టి ఇంటి నిర్మాణం నిర్మించడం చూపరులను ఆశ్చర్యనికి గురించేస్తుంది. ఇంత దర్జాగా “ప్రభుత్వ భూమి కబ్జా” చేస్తే అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు ఎందుకు పాతినట్లు గ్రామస్తులకు అర్ధం కావడం లేదని అధికారులను ప్రశ్నస్తున్నారు. తన అధీనంలో హక్కు అనుభవం కలిగి చుంచులూరు రెవిన్యూ లో చింతలపల్లి పుల్లమ్మ పేరు మీద ఉన్న సర్వేనెంబర్‌ 185-1 లో ఖాతా నంబర్ 352 గల 2-50ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు ఆక్రమించి రాత్రికి రాత్రే చుట్టూ పెన్సింగ్ వేశారని బాధితులు చింతలపల్లి పోలయ్య మండలం లో ఫిర్యాదు చేశారు.2012లో ప్రభుత్వం తమకు సర్వే నంబర్185-1 రెండు ఎకరాల యాభై సెంట్లు (2-50 ) పొలాన్ని డిపట్టా మంజూరు చేసి పాస్ బుక్ మరియు వన్ బి అడంగల్ కలిగి ఉన్నాడు. నాటి నుంచి ఆ పొలం అతని అదినంలోనే ఉంది అయితే గ్రామానికి చెందిన ఒకరు రాజకీయ పరపతిని అడ్డుపెట్టుకొని దౌర్జన్యంగా పొలాన్ని ఆక్రమించుకొని చుట్టూ కంచె వేసుకొని పొలంలోకి రాకుండా అడ్డుకుంటున్నాడు అని పోలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సదరు సిజీఎఫ్ పొలం వాళ్ల పెదనాన్న పేరు మీద గతంలో ఉన్నట్లు ఆక్రమణ దారుడు బెదిరిస్తున్నట్లు తెలియజేసారు మండల వ్యాప్తంగా కబ్జాదారులు వారి ఇష్టానుసారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. దోచుకున్నవారికి దోచుకున్నంత అన్న చందంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మండలంలో ఆక్రమణలు ఎక్కువవుతున్నాయని మండల ప్రజలు తెలియజేస్తిన్నారు.ఇప్పటికైనా సమర్థ పాలన అందిస్తున్న జిల్లా కలెక్టర్ మర్రిపాడు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :