- భూములు ఆక్రమణలపై ఫిర్యాదులే తప్ప పరిస్కారం లేదు….
- బాధితుడు.. పోలయ్య.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తెచ్చిన స్పందన కార్యక్రమం అక్కరకు రావడం లేదని నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం,చుంచులూరు గ్రామానికి చెందిన పోలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్పందన నిర్వహిస్తున్నా దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని. వారం వారం అర్జీలను అధికారులు స్వీకరిం చడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని, పలుమార్లు ఫిర్యా దులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆర్జీదారుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2019 జూన్ 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా మొదట్లో సక్రమంగా కొనసాగినా రానురాను ఆలస్యనికి గురవుతోందని సమస్యలు త్వరతగతిన పరిస్కారం చూపగలరని అర్జీదారుడు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలు గా తన అధీనంలో హక్కు అనుభవం కలిగి చుంచులూరు రెవిన్యూ లో చింతలపల్లి పుల్లమ్మ పేరు మీద ఉన్న సర్వేనెంబర్ 185-1 లో ఖాతా నంబర్ 352 గల 2-50 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు ఆక్రమించి రాత్రికి రాత్రే చుట్టూ ప్రిన్సింగ్ వేశారని బాధితులు చింతలపల్లి పోలయ్య అతని కుమారుడు నరసింహులు కలెక్టర్ కార్యాలయం స్పందనలో అర్జీ సమర్పించి ఫిర్యాదు చేశారు.
2012లో ప్రభుత్వం తమకు సర్వే నంబర్ 185-1 రెండు ఎకరాల యాభై సెంట్లు (2-50 ) పొలాన్ని డిపట్టా మంజూరు చేసిందన్నారు. పాస్ బుక్ మరియు వన్ బి అడంగల్ కలిగి ఉన్నానని నాటి నుంచి ఆ పొలం నా అదినంలోనే ఉందని తెలియజేసారు అయితే గ్రామానికి చెందిన ఒకరు రాజకీయ పరపతిని అడ్డుపెట్టుకొని దౌర్జన్యంగా పొలాన్ని ఆక్రమించుకొని చుట్టూ కంచె వేసుకొని పొలంలోకి రాకుండా అడ్డుకుంటున్నాడని వాపోయాడు. సిజీఎఫ్ పొలం వాళ్ల పెదనాన్న పేరు మీద గతంలో ఉన్నట్లు ఆక్రమణ దారుడు బెదిరిస్తున్నట్లు తెలియజేసారు ఈ విషయం ఫై పరిశీలనకు వచ్చిన సర్వేయర్ సదరు పొలాన్ని పరిశీలించి ఏకపక్షంగా రిపోర్ట్ వ్రాసి తహసీల్దార్ కు సమర్పించి వారితో ఫోటో తీసి సమస్య పరిస్కారం చేసినట్లు మిన్న కున్నారుని బాధితుడు పోలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయం ఫై జిల్లా కలెక్టర్ పరిస్కార మార్గం చూపగలరని బాధితుడు కోరుతున్నారు.