కరీంనగర్ జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్టా రవీంద్ర చారి గురువు గారైనటువంటి కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ కెప్టెన్ లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎలా చదవాలి ఎలా నడుచుకోవాలి,ఏం చేయాలి అనే విషయాలపై శ్రద్ధ వహించాలని తన ప్రసంగంలో తెలియజేశారు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి బుర్ర మధుసూదన్ రెడ్డి కి మరియు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బొడ్డు సునీల్, లయన్ సీనియర్ మెంబర్ ఇనుగుర్తి రమేష్,స్కూల్ చైర్మన్ బుర్ర మల్లేష్ గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ,తేల్ల భాస్కర్,నర్సయ్య,మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
