- మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.
- మాచర్ల పట్టణంలోని 16వ సచివాలయ పరిధిలో
- వినాయకుని గుట్ట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి.
- తేకుల లక్ష్మీ కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణం చేత మృతి చెందడం జరిగింది.
- మాచర్ల మున్సిపల్ కమిషనర్ ఇవి రమణబాబు చేతుల మీదుగా 10000 ఆర్థిక సాయం అందించారు.
పల్నాడు జిల్లా మాచర్ల: వినాయకుని గుట్ట ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన తేకు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. మాచర్ల మున్సిపల్ కమిషనర్ రమణ బాబు స్పందించి తానె స్వయంగా వెళ్ళి మృతురాలు కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కమిషనర్ ఇవి రమణ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ బీమా, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకములన్ని సకాలంలో వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని ,సచివాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా మీ బ్యాంకు లోనే డబ్బులు జమ చేస్తామని ఆమె భర్త కి హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో 30 31 వార్డుల కౌన్సిలర్స్ షేక్ కరిముల్లా, వేల్పుల గురవయ్య , కంభంపాటి భాస్కరరావు, పోలేపల్లి ఆనంద్, కోకా సుబ్బారావు, ,ఆలేటి సజ్జన్ , గెల్లేపోగు సామేలు, 16వ సచివాలయం అడ్మిన్ లక్ష్మీనారాయణ, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ టి మహేష్, వైసీపీ కార్యకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.