- పోస్టర్ ఆవిష్కరించిన అసెంబ్లీ ఇన్చార్జి ఏగోళపు వెంకన్న గౌడ్
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బావి భారత ప్రధాని బైహేన్ కుమారి మాయావతి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న తెలంగాణ భరోసా సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు అసెంబ్లీ ఇన్చార్జి ఏగోళపు వెంకన్న గౌడ్ హాజరై ఆవిష్కరించారు. మే 7వ తేదీన సరూర్నగర్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్రంలో బీఎస్పీ మాత్రమే సుపరిపాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బామండ్ల ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి భూమయ్య, తిరుపతి బామండ్ల ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.