ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 1న 137 వ “మేడే” ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఈరోజు పిడుగురాళ్ల పిల్లుట్ల రోడ్డు సున్నపు బట్టీల దగ్గర ఎం సి పి ఐ ఆధ్వర్యంలో కరపత్రావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యం సి పి ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి అబ్రహం లింకన్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై విరోచిత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికుల పొట్ట మీద కొట్టడం, కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలను మూసివేసి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్మికులకు ఉపాధి లేకుండా రోడ్డున పడవేసింది దీని ద్వారా అనేక దేశాలలో ఆహార సంక్షోభం ఆర్థిక మాంద్యం విజృంభిస్తున్నది మరో ప్రక్క నిత్యవసర ధరల వస్తువులు విపరీతంగా పెంచడంతో కార్మికులపై విపరీతమైన భారం పడింది ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించవలసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం వారి సొంత లాభం కోసం ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ అడిగిన వారి మీద కేసులు పెడుతున్నారు. ఈ పిడుగురాళ్ల ప్రాంతంలో ప్రధానమైన సున్నపరిశ్రమలో కొన్ని వేలమంది ఎన్నో సంవత్సరాల నుండి అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ వీరిని ప్రభుత్వం గుర్తించకపోగా ఎటువంటి కార్మిక చట్టాలు కల్పించకపోవడం సిగ్గుచేటు పని ప్రదేశాల్లో కార్మికుల కనీస సౌకర్యాల కోసం జరిగిన విరోచత పోరాటమే కార్మికుల మేడే దినోత్సవం అని తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలతో ప్రైవేటీకరణకై అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులంతా ఏకమై హక్కుల కోసం, కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, కనీస కూలి రేట్లు అమలకై ప్రభుత్వరంగ సంస్థల రక్షణకై ఐక్య పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు కృష్ణ, పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు, అంబేద్కర్ ప్రచార సాధన సమితి అధ్యక్షులు డేగల అబ్రహం, ఆర్బిఐ కుమార్ సి టి యు నాయకులు కోటేశ్వరరావు, వీర్లంకయ్య,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
