contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డైవర్షన్ రోడ్ లేక అవస్థలు పడుతున్న రైతులు … ఐదు గ్రామాల రాకపోకలకు అంతరాయం

  • డైవర్షన్ రోడ్ లేక అవస్థలు పడుతున్న రైతులు
  • ఐదు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం
  • 3 కోట్ల 70 లక్షలు తో బ్రిడ్జి నిర్మాణం
  • ఆందోళన చేస్తున్న రైతులు

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ముష్మి గ్రామ పంచాయతీ పరిధిలో తండ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టుతున్నాయి. రూ. 3.70 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ డైవర్షన్ రోడ్ లేకపోవడంతో, కనీస రాకపోకలకే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ బ్రిడ్జి పనులు మూడు కోట్ల 50 లక్షలతో ప్రారంభించినప్పటికీ, ప్రాజెక్టు పనుల్లో డైవర్షన్ రోడ్డుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ముష్మి, తండ, లింగాయత తండా, ముక్కోడ తండా, కిషన్ తండా గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు తమ పొలాల వద్దకు వెళ్లే మార్గాలు పూర్తిగా బందయ్యాయి.

“బ్రిడ్జి నిర్మాణం మంచిదే కానీ, రహదారి లేకపోవడం వల్ల మాకు రాకపోకలు పెద్ద సమస్యగా మారాయి,” అని స్థానిక రైతు శ్రీనివాస్ వాపోయారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాము ఎలాగైనా తమ పొలాలకు వెళ్లి పంటలు చూసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే డైవర్షన్ లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైతులు అధికారులను వెంటనే స్పందించాలని, తాత్కాలికంగా అయినా డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పలు గ్రామాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నా, తాత్కాలికంగా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం నెలకొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :